లక్ష్మీ ఫ్రై డ్ కాలనీ అభివృద్ధి కోసం కుటుంబాలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ పనిచేయడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ చక్రిపురం లక్ష్మీ ప్రైడ్ కాలనీ కుటుంబాలంతా ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి, సిసిఎస్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మహిళా సోదరీమణులు ముందుకు రావడం మహదానందంగా ఉందన్నారు. ముందుగా కాలనీకి చెందిన మహిళలు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఫ్రై డ్ సంక్షేమ సంఘం, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాంచందర్, సుధాకర్ రెడ్డి, యుగేందర్ గౌడ్, రామ్మోహన్, ఈశ్వరయ్య, ఇటిక్యాల రామకృష్ణారెడ్డి, ఎంపల్లి పద్మా రెడ్డి, గంప కృష్ణ, సారా అనిల్ ముదిరాజ్, సారా వినోద పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా