కాంగ్రెస్ నాయకులంతా సమన్వయo తో సాగుతామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఖమ్మం లో భారీ ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయం కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో నిబద్దతగా పని చేశానని అదే ఒరవడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ లోని జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకుల సూచనలు సలహాల మేరకు అందరం కలిసి సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు .
కాంగ్రెస్ లో చేరినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తుమ్మల తెలిపారు. ఎవరైనా పార్టీలో చేరితే వద్దంటారని తనకు మాత్రం కాంగ్రెస్ లోని కింద నుంచి పై స్థాయి నేతలు వరకు ఆహ్వానించారని తెలియజేశారు.