సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాత లయన్స్ క్లబ్ సభ్యుడు హైకోర్టు న్యాయవాది,అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కే.ఉదయ్ కుమార్ గౌడ్ సహాయ సహకారాలతో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాసిల్దార్ జయశ్రీ హాజరై మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం వేసవిలో గొడుగులను అందజేస్తున్నట్లు తెలిపినారు.సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.అధికారులు,వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ లయన్స్ క్లబ్ లో సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్, పిన్నని కోటేశ్వరరావు ప్రభావతి,సంపత్ వర్మ,కోలా నాగేశ్వరరావు,గోవిందరెడ్డి, శ్రీనివాసరాజు,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, చేపూరి సైదులు,రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్