హైదరాబాద్ లోని బాలాపూర్ మండలం మల్లాపురంలో బ్యాంక్ మెన్ వాసవి ఓల్డేజ్ హోం వేసవి ఆహార శిబిరం ఏర్పాటు చేసింది. ప్రతి ఆదివారం మల్లాపురం గ్రామంలో సంత జరుగుతుంది. సంతకు గ్రామవాసులే కాకుండా చుట్టు పక్కన ఉన్న గ్రామ ప్రజలు దాదాపు 1000 మందికి పైగా వస్తారు.
ఈ మండు వేసవిలో వారి దాహం తీర్చడానికి చల్లటి మంచి నీళ్ళు, మజ్జిగ, ఆకలి ఉన్నవారికి ఆహార పొట్లాలు పంపిణీ చేసేందుకు వాసవి ఓల్టేజీ హోం కుటీర్, బ్యాంక్ మెన్ చాప్టర్ అధ్యక్షుడు పి వి రమణయ్య ఆధ్యర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు, ట్రస్టీ లకి, అన్నపూర్ణ స్కీం డొనేషన్ ఇచ్చిన వారికి రమణయ్య ధన్యవాదాలు తెలిపారు.