ములుగు,భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన గనిపాక రాజు ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు.
విషయం తెలుసుకున్న తస్లీమా సోమవారం వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓద్దార్చి, పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని,ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని తస్లీమా అన్నారు.
సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వర్చా రిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.