సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో ఆదివారం 20 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదిత్య ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ నుండి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ చింతలపాలెం మండల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు. అట్లే గుడిమల్కాపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త మద్ది వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, డిసిసిబి డైరెక్టర్ వేములూరి రంగాచారి, ఎంపీటీసీ సైదిరెడ్డి, లక్ష్మీ ఏడుకొండలు, చింతిరాల సైదులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.