37.2 C
Hyderabad
May 6, 2024 13: 41 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్

#Election Commissioner

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్‌ను నియమించింది.

తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్‌ కుమార్‌ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు.

అలాగే ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు.

Related posts

కాలుష్యంతో నిండిపోయిన దూలపల్లి తుమ్మర్ చెరువు

Bhavani

ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్న పువ్వాడ

Bhavani

దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన టీఆర్ఎస్ యువ‌నేత‌

Sub Editor

Leave a Comment