ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే ఆవేదనతో ఒక యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగింది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ నార్త్ మాడ స్ట్రీట్ లో ఉన్న ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన జరిగింది. తిరుపతిలో మృతి చెందిన ఈ ప్రేమ జంటను ఈస్ట్ గోదావరి కొవ్వూరు కి చెందిన అనుషా, హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం పోసి బాబు అనే వ్యక్తికి అనూషాను ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని భావిస్తున్నారు పోలీసులు. ఈనెల మూడో తేదీ ఈస్ట్ గోదావరి కోవూరు పోలీస్ స్టేషన్లో అనూష పై మిస్సింగ్ కేసు నమోదు అయింది.
previous post
next post