విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు చొప్ప హేమంత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. మల్కాపురం మార్కెట్ సమీపంలోని శెట్టిబలిజ వీధిలో రాత్రి 10.:45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హేమంత్ కుమార్ హత్యకు గురయ్యాడు.
మృతుడు హేమంత్ కుమార్ పై మల్కాపురం పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడు గతంలో పులు కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఏ. డి సి.పి డీఎస్ శ్రవణ్ కుమార్ మల్కాపురం సిఐ లూధర్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.