ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 10 కిలోమిటర్ల పరిధిలో రూ.800 పాస్ తో అపరిమిత ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చింది.
మొదట కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాలలో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు పల్లె వెలుగు టౌస్ బస్ పాస్ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ప్రస్తుతం ఈ టౌన్ పాస్తో ప్రయాణీకులు కరీంనగర్, మహబూబ్నగర్లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్గొండలో 5 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణానికి అవకాశం కల్పించారు. 10 కిలోమీటర్ల నెలవారి పాస్ ధర రూ.800, 5 కిలోమీట్రల పరిధికి రూ. 500 లుగా నిర్ణయించారు.