కలియుగ భీముడు మరణించాడు. ‘మహాభారత్’ టీవీ సిరీస్లో భీముడి పాత్ర పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి 74 ఏళ్ల వయసు లో మరణించారు. న్యూ ఢిల్లీలోని అశోక్ విహార్ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు ప్రసిద్ధి చెందిన నటుడు, అథ్లెట్ అయిన ప్రవీణ్ కుమార్ మహాభారత్ భీముడిగా దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో పేరు పొందారు.
ఆయనకు దీర్ఘకాలికంగా ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్య ఉంది. సోమవారం రాత్రి, ఆయనకు తీవ్రంగా అసౌకర్యంగా అనిపించినప్పుడు మాకు చెప్పగానే మేము ఇంటికి వైద్యుడిని పిలిపించాము. అయితే గుండె ఆగిపోవడంతో రాత్రి 10-10.30 గంటల మధ్యలో ఆయన మరణించారు” అని ప్రవీణ్ బంధువు తెలిపారు.
ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి ఉన్నారు. ప్రవీణ్ సోబ్తి డిస్కస్ త్రోలోనూ, వివిధ అథ్లెటిక్ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1966, 1970లో రెండు బంగారు పతకాలతో సహా ఆసియా క్రీడలలో నాలుగు పతకాలను కూడా గెలుచుకున్నాడు. 1966 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో హామర్ త్రోలో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఆయన తన నటనా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత 988లో BR చోప్రా క్లాసిక్ ‘మహాభారత్’లో భీమ్గా కనిపించి మరింత ప్రజాదరణ పొందాడు.