36.2 C
Hyderabad
May 14, 2024 15: 24 PM
Slider ఆధ్యాత్మికం

కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

#KapileswaraswamyTemple

తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.

కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో మహాలక్ష్మీ, సరస్వతి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు.

ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

సిబిఐటి, ఎక్సెల్ఆర్ మధ్య అవగాహన ఒప్పందం

Satyam NEWS

చితకొట్టుడు 2 గోష్ట్ వెర్ష‌న్ 2.0 టీజ‌ర్ విడుద‌ల‌

Sub Editor

పీజీ సీటు టెన్షన్ లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

Satyam NEWS

Leave a Comment