31.2 C
Hyderabad
May 2, 2024 23: 49 PM
Slider నిజామాబాద్

రుణ మాఫీ కోసం సొసైటీ మహా జన సభ తీర్మానం

#janamahasabha

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహా జనసభ నిర్వహించారు. సహకార సంఘం అధ్యక్షుడు సదాశివరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు.

రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేయాలని తీర్మానించారు. కుప్రియాల్, మర్కళ్, మోషంపూర్, రామారెడ్డి గ్రామాల్లో గోదాములు నిర్మించాలని, అడ్లూర్ ఎల్లారెడ్డిలో నూతన కార్యాలయ భవనం నిర్మించాలని, ఉప్పలవాయి ఎన్సిడిసి వారి రుణ సదుపాయంతో గోదాం నిర్మించాలని సమావేశంలో తీర్మానించారు.

అలాగే రైతులు వాణిజ్య పంటలు, కూరగాయలు పండించాలని, సేంద్రియ పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ పశుపతి, రైతుబంధు అధ్యక్షుడు భూంరెడ్డి, జనార్దన్ రెడ్డి, నారాయణ రెడ్డి, డైరెక్టర్లు భాస్కర్, నర్సవ్వ, రాములు, ప్రవీణ్ రెడ్డి, మహిపాల్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం కల్పించాలి

Satyam NEWS

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులైజ్ చేయాలి

Bhavani

4 కోట్ల బాక్స్ డ్రైన్ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment