మహబూబ్ నగర్ లో ఏఐసిసి శిక్షణ తరగతుల ఇంచార్జిగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచి అరుణ్ కుమార్ దేశ్ముఖ్ ని నియమించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ దేశముఖ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలను కలసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ZOOM యాప్ కలిగి ఉండాలని కోరారు.
తనపై నమ్మకం ఉంచి ఏఐసిసి శిక్షణా తరగతుల ఇంచార్జిగా నియమించినందుకు ఏఐసీసీ శిక్షణా తరగతుల ఇన్చార్జ్ సచిన్ రావు, తెలంగాణ ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు నల్లగొండ జిల్లా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ శిక్షణ తరగతుల ఇన్చార్జిగా నియమితులైన అరుణ్ కుమార్ దేశముఖ్ కి నాయి బ్రాహ్మణ జిల్లా సంఘం అధ్యక్షుడు సుతారి జానకి వేణుగోపాల్, యాదవ సంఘం జిల్లా నాయకుడు పాశం రామరాజు యాదవ్, ఎస్సీ సంఘం నాయకుడు మేళ్ళచెర్వు ముక్కంటి,కొప్పెర వెంకన్న,కొల్లూరి రాము, తండు శ్రీను తదితర కార్యకర్తలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.