NH 563 కింద తన ఇల్లు కోల్పోతున్న విషయం తెలుసుకుని ఒక మహిళ గుండె ఆగింది. తమ విజ్ఞప్తులను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆమె మనస్తాపానికి గురైంది.
ఎల్కతుర్తి మండలం వల్భా పూర్ గ్రామానికి చెందిన అంబాల సరోజన (60) అనే వివాహిత గుండెపోటుతో శుక్రవారం మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గ్రామం బయట నుండి బైపాస్ తీయాలని కోరుతూ అనేక సార్లు అధికారులకు, నాయకులకు వినతిపత్రాలు ఇస్తూనే దాదాపుగా నెల రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేశారు.
కొంతకాలం పాటు ఆగిపోయిన సర్వే పనులు మళ్లీ మొదలు కావడం తో పాటుగా శుక్ర వారం అధికారులు వల్భాపుర్ గ్రామానికి సర్వే కు మళ్లీ వచ్చారు.
విషయం తెలిసిన సరోజన అధికారులు తమ ఇంటికి సర్వే కు వస్తున్నారని ఒక్కసారిగా అపస్మారక స్థితి చేరుకుంది.
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండె నొప్పితో అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన అధికారులు అక్కడినుండి వెళ్ళిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.