37.7 C
Hyderabad
May 4, 2024 13: 09 PM
Slider కరీంనగర్

నేషనల్ హైవే కింద ఇల్లు పోతుందని గుండె ఆగి మహిళ మృతి

#sarojana

NH 563 కింద తన ఇల్లు కోల్పోతున్న విషయం తెలుసుకుని ఒక మహిళ గుండె ఆగింది. తమ విజ్ఞప్తులను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆమె మనస్తాపానికి గురైంది.

ఎల్కతుర్తి మండలం వల్భా పూర్ గ్రామానికి చెందిన అంబాల సరోజన (60) అనే వివాహిత గుండెపోటుతో శుక్రవారం  మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గ్రామం బయట నుండి బైపాస్ తీయాలని కోరుతూ అనేక సార్లు అధికారులకు, నాయకులకు వినతిపత్రాలు ఇస్తూనే దాదాపుగా నెల రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేశారు.

కొంతకాలం పాటు ఆగిపోయిన సర్వే పనులు మళ్లీ మొదలు కావడం తో పాటుగా శుక్ర వారం అధికారులు వల్భాపుర్ గ్రామానికి సర్వే కు మళ్లీ వచ్చారు.

విషయం తెలిసిన సరోజన అధికారులు తమ ఇంటికి సర్వే కు వస్తున్నారని ఒక్కసారిగా అపస్మారక స్థితి చేరుకుంది.

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండె నొప్పితో అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన అధికారులు అక్కడినుండి వెళ్ళిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

Related posts

పరీక్షల సమయంలో విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్లాలి

Satyam NEWS

ఆదివాసి మహిళను వివస్త్రను చేసిన అధికారిని సస్పెండ్ చేయాలి

Satyam NEWS

జగన్ క్యాబినెట్: మళ్లీ మారిన సమీకరణాలు

Satyam NEWS

Leave a Comment