38.2 C
Hyderabad
May 3, 2024 22: 31 PM
Slider నిజామాబాద్

బాన్సువాడలో అంగరంగ వైభవంగా మహిళ దినోత్సవ సంబురాలు

#pocharamsrinivasareddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియం లో మహిళ దినోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక కౌన్సిలర్ నేహసుల్తాన హకీమ్, స్పీకర్ కు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలికారు.

బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్ రాంరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి రాఖీ కట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభాపతి స్పూర్తిదాయకంగా నిలిచిన వేరే వేరే విభాగాల కొందరు మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కొన్ని ఆటలు నిర్వహించారు. Thank YOU KCR అని అర్దం వచ్చేలా మానవ హారంగా నిలబడిన మహిళలు ఈ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు,  పిల్లలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఫ్లైడ్ లైట్ల వెలుగులో విజయనగరానికి పైడితల్లి సిరిమాను చెట్టు…

Satyam NEWS

నత్తనడక డ్రైనేజీ పనులతో మార్కెట్ దారులకు తీవ్ర ఇబ్బంది

Satyam NEWS

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు

Satyam NEWS

Leave a Comment