కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియం లో మహిళ దినోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక కౌన్సిలర్ నేహసుల్తాన హకీమ్, స్పీకర్ కు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలికారు.
బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్ రాంరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి రాఖీ కట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభాపతి స్పూర్తిదాయకంగా నిలిచిన వేరే వేరే విభాగాల కొందరు మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కొన్ని ఆటలు నిర్వహించారు. Thank YOU KCR అని అర్దం వచ్చేలా మానవ హారంగా నిలబడిన మహిళలు ఈ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, పిల్లలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం