40.2 C
Hyderabad
May 6, 2024 18: 50 PM
Slider విజయనగరం

ఫ్లైడ్ లైట్ల వెలుగులో విజయనగరానికి పైడితల్లి సిరిమాను చెట్టు…

#vijayanagaram

విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ప్రారంభమైంది. అనువంశిక పూజారి కి కలలో కనిపించిన మీదట గంట్యాడ మండలం సిరిపురం లో చింత చెట్టును కనుగొన్నారు. ఈ మేరకు డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభధ్ర స్వామి సమక్షంలో ఆ చెట్టు కు పూజలు నిర్వహించారు. అనంతరం చెట్టు ను కొట్టి.. ఊరేగింపుగా విజయనగరంలోని హుకుం పేటలో  పూజారి ఇంటి వద్దకు తీసుకువస్తున్నారు. ఈ రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో హుకుం పేటకు సిరిమాను చెట్టు రానుంది. దేవాదాయ ధర్మాదాయ అసిస్టెంట్ కమీషనర్ కిషోర్ తగ్గరుండీ చెట్టు ను పూజా రి ఇంటికి తరలించే పనిలో ఉన్నారు. బందోబస్తు పరంగా నగర వన్ టౌన్ సీఐ డా.వెంకటాద్రి, రూరల్ సీఐ తిరుపతి రావు..ఎస్ఐ లు కిరణ్, నారాయణ, విజయకుమార్, ప్రసాద్ లతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్.టీ.ఎఫ్) సిబ్బంది ఉన్నారు.

Related posts

తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి

Bhavani

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ ఇన్ పుట్ ఉండాలి

Satyam NEWS

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

Satyam NEWS

Leave a Comment