38.2 C
Hyderabad
April 28, 2024 19: 46 PM
Slider పశ్చిమగోదావరి

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు

#rape

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ నాగన్న గూడెం లో  బంధువుల ఇంటికి వేసవి సెలవులు కు వచ్చిన ఓ మైనర్ బాలిక కనిపించడం లేదని బాలిక బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్ ఐ లక్ష్మణ్ సోమవారం రాత్రి తెలిపారు. అయితే బాలికను రామసింగవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నాగన్న గూడెం లో ఉన్న తన బంధువుల దగ్గర ఉంటూ ఇదే గ్రామంలో బంధువుల ఇంటికి వేసవి సెలవులుకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి గత నాలుగు రోజుల క్రితం తీసుకెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. గతం లో కూడా ఒకసారి ఈ బాలికను ఇదే వ్యక్తి తీసుకెళ్లాడని గుర్తించిన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి 25 వేలు జరిమానా విధించినట్టు సమాచారం. అయితే గత నాలుగు రోజుల నాడు బాలిక బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ ఐ లక్ష్మణ్ తెలిపారు. అతనిపై ఫోక్సో చట్టం క్రింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Related posts

ఆరోగ్యంతో ఎలా బతకాలి?: నాగర్ కర్నూల్ ఎస్పి సూచన

Satyam NEWS

ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

సేఫ్టీ ఫస్ట్: గ‌నుల‌లో భ‌ద్ర‌త పై స‌మావేశం

Satyam NEWS

Leave a Comment