40.2 C
Hyderabad
May 6, 2024 16: 53 PM
Slider వరంగల్

మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయిస్తా

#MuluguDt

మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడం తన బాధ్యత అని, అందుకు కావాల్సిన అంశాలపై ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఆదివారం నాడు మల్లంపల్లి  మండల సాధన సమితి సభ్యులతో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు.

మల్లంపల్లి మండలం ఏర్పాటుకు తాను చేస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు. చిన్న మండలంగా కాకుండా అవసరమైన గ్రామాలను చేర్చి పెద్ద మండలంగా ఏర్పాటు చేయాలని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందే మండలం  ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు.

పుట్టిన ఊరు రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందని జగదీశ్వర్ అన్నారు. 1985 లోనే మల్లంపల్లి మండలం గా ఏర్పాటు కావలసింది కానీ వివిధ కారణాల వల్ల అది జరగలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య, ముఖ్య  సలహాదారులు కానుగంటి సతీష్, అళ్లెపు రాజు, సహాయ కార్యదర్శులు ఎడ్ల అనిల్ రెడ్డి, గాజు అజయ్, కోశాధికారి కుక్కల సంపత్, కార్యవర్గ సభ్యులు కొంగరి శ్రీనివాస్ రావు, భాష బోయిన సురేష్, నాగుల శ్రీకాంత్, మాచర్ల రాజు,పోనుగంటి రవి, రణధీర్, గ్యారంపెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు

Bhavani

కడపలో సర్పంచుల సమర శంఖారావం

Bhavani

చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Satyam NEWS

Leave a Comment