సీఎం వై ఎస్ జగన్ సొంత జిల్లాలో గ్రామ సర్పంచ్ లు సమర శంఖం పూరించారు. కడప కలెక్టరేట్ వద్ద సర్పంచులు నేడు మహా ధర్నా నిర్వహించారు. మహాధర్నాలో పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై వీ బీ రాజేంద్రప్రసాద్, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాల రావు, అఖిలపక్ష పార్టీల నేతలు, సర్పంచులు, మాజీ సర్పంచ్ లు పాల్గొన్నారు.
ఉపాధి హామీ విధులను గతంలో మాదిరి గ్రామ పంచాయతీలకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు 8660 కోట్లను సర్పంచ్ ల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీలలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.