28.7 C
Hyderabad
May 5, 2024 10: 38 AM
Slider ప్రత్యేకం

ఈటెలకు మతి స్థిమితం లేదు

#Mallu Ravi

ఈటెలకు మతి స్థిమితం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి టిఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందని అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటెల రాజకీయాల్లో దిగజారిపోయారు. బీజేపీ లో చేరిన తర్వాత వ్యక్తిత్వం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. బీజేపీ లో తనకు విలువ లేకుండా పోవడం తో మతి స్థిమితం కోల్పోయి పిచ్చి లేసి మాట్లాడుతున్నారు అని మల్లు రవి అన్నారు. ఈటెలకు ధైర్యం ఉంటే రాజకీయాలలో చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించి రేపు భాగ్యలక్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తాను తప్పుడు ఆరోపణలు చేశామని బహిరంగ క్షమాపణ చెప్పాలని మల్లు రవి అన్నారు.

Related posts

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

ల‌య‌న్ ఈజ్ బ్యాక్..కాదు కాదు బాయ‌స్  ఈజ్ బ్యాక్…!

Satyam NEWS

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో భారీ చోరీ

Satyam NEWS

Leave a Comment