ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు ఎమ్మార్పీఎస్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహా దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ ఇందిరాపార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ను పూర్తిగా దారి మళ్లించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇందిరా పార్కు చుట్టూ ఆంక్షలు విధించారు. ఇందిరాపార్క్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అదే విధంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహా దీక్ష లో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారని పోలీసులకు సమాచారం అందిందట. దాంతో పోలీసులు అప్రమత్తమైనారట. ఆర్టీసీ కార్మికుల సమ్మెకుకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న సబ్బండ కులాల మహాదీక్ష కు వస్తున్నమంద కృష్ణ మాదిగను హబ్సిగూడ లోని కృష్ణ లాడ్జ్ లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను మేడిపల్లి పీఎస్ కు తరలించారు.
previous post