23.2 C
Hyderabad
May 7, 2024 23: 49 PM
Slider వరంగల్

బి అర్ ఎస్ లో చేరిన మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు

#BRS

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సింగరాజుపల్లి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి, యువనాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి, ఆకుల పృథ్వి బి అర్ ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మంత్రి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని వారి నివాసంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా కత్తుల సోమిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై, అభివృద్ధిలో భాగస్వాములము కావడానికి బి అర్ ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు.

మన ప్రాంతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి ని చూసి రాబోయే ఎన్నికల్లో దయన్న అధిక మెజారిటీ తో గెలిపించే0దుకు తన వంతు బాధ్యతగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకపోతుల నర్సింహులు, PACS ఛైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, నాయకులు బస్వ మల్లేశం, పల్లా సుందర్ రాం రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి, సింగరాజు పల్లి సర్పంచ్ గోపాల్ దాసు, మల్లేష్, నాయకులు అన్నారపు యాదగిరి, రచ్చ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లె రాజకీయ ముఖచిత్రంలో కన్వీనర్లే కీలకం

Bhavani

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Satyam NEWS

జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment