వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 14 నవంబర్ ఆదివారం రోజున జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలలో వివిధ విభాగాల విద్యార్థులకు యుద్ధ విద్యలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో సూపర్ సీనియర్ కేటగిరీలో బుద్ధారం రవికుమార్ బంగారు పథకం సాధించగా, సీనియర్ కేటగిరిలో 80 కేజీల విభాగంలో కోడేరు తరుణ్ లు బంగారు పతకాలు సాధించడం జరిగింది. అలాగే సబ్ జూనియర్ బాలుర విభాగంలో లోకనాథ్ బుద్ధారం, సబ్ జూనియర్ బాలికల విభాగంలో యశస్వి బుద్ధారంలు బంగారు పతకాలు సాధించడం జరిగింది. అలాగే యుదిస్టీర్ అనే మరో విద్యార్థికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అలాగే వీరంతా నవంబర్ 25,26,27 తేదీలలో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం జరిగింది…కోచ్ రవి కుమార్ మీడియా కు తెలియజేశారు.
previous post