కచ్చితమైన కారణం తెలియదు కానీ ఒక వివాహిత అకస్మాత్తుగా వచ్చి కాకతీయ కాల్వలో దూకింది. ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న ఆ మహిళను అక్కడి మత్స్యకారులు గమనించి కాపాడారు. ఈ దురదృష్టకర సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో జరిగింది. అక్కడి కాకతీయ కాలువలో దూకిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి కాపాడారు.
తక్షణమే వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమెకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ప్రాధమిక సమాచారం. ఆమె బంధువులు వచ్చి చెబితేగానీ పూర్తి వివరాలు వెల్లడికావు.