సంక్రాంతి జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని, ప్రజలు జీవితాలలో వెలుగులు నింపాలని, ప్రతి ఇంట సిరులు నింపాలని, ఆ సిరులతో మీ మనసు సంతోషపారవశ్యం కావాలని మనస్ఫూర్తిగా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని డివిజన్ ప్రజలందరికీ భోగి పండుగ , సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం మల్లాపూర్ డివిజన్ లోని బ్రహ్మపురి లో తన ఇంటి వద్ద డివిజన్ ప్రజలతో, నాయకులతో కలిసి భోగి మంటలు వేసి కొని ప్రజలతో పండగ సంతోషాన్ని పంచుకొన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి