42.2 C
Hyderabad
May 3, 2024 16: 13 PM
Slider గుంటూరు

న్యూ స్కీమ్: జగనన్న విద్యా వసతి కార్యక్రమం ప్రారంభం

maddali giri 24

జగనన్న విద్యా వసతి దీవెన కార్యక్రమం గుంటూరులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్నిగుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ITI చదువుతున్న విద్యార్థుల కు 10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల కు 15 వేలు, డిగ్రీ ఆపైన చదువుతున్న విద్యార్థుల కు 20 వేలు వారి చదువును బట్టి సగం మొత్తం చెల్లిస్తారు.

అదీ కూడా వారి తల్లుల బ్యాంక్ ఎకౌంట్ లో నేరుగా మొదటి విడత గా చెల్లిస్తారు. సోమవారం ఉదయం గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి తో బాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, నగర YSRCP అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అర్హులైన విద్యార్థుల తల్లులకు నగదును అందచేశారు.

Related posts

అక్రమాస్తుల కేసు: సీబీఐ జడ్జి బదిలీ తో తిరిగి విచారణ ప్రారంభం!

Satyam NEWS

కెసిఆర్ నాయకత్వం దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు

Satyam NEWS

నాగరమంతా విడిఎఫ్ రోడ్లు

Bhavani

Leave a Comment