32.2 C
Hyderabad
May 12, 2024 20: 00 PM
Slider ముఖ్యంశాలు

ఎవరు హామీ ఇస్తే వారికే మా మద్దతు

#congress

తెలంగాణ మస్కూరి ఇస్సాదారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నక్క హరీష్

సుంకరి (మస్కూరి) ఇస్సాదారుల విధానం అమలుపై ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరు హామీ ఇస్తే వారికే తమ మద్దతు ప్రకటిస్తామని తెలంగాణ మస్కూరి ఇస్సాదారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నక్క హరీష్, జనరల్ సెక్రెటరీ వరద సంపత్ కుమార్ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి కొనసాగుతున్న సుంకరి ఇస్సాదారుల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 81, 85 జిఓ తెచ్చి రద్దు చేసి ఇస్సాదారుల కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు. ఈ జిఓ రద్దు చేయాలని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ సత్తా ఓట్ల రూపంలో చూపించే అవకాశం దక్కిందన్నారు. తమ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ ఇస్సాదారులను ఐక్యం చేస్తున్నామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇస్సాదారుల కుటుంబాలకు సంబంధించి 18 వేలకు పై చిలుకు ఓట్లు ఉన్నాయని,బితమ సమస్య పరిష్కారానికి ఏ పార్టీ అయితే హామీ ఇస్తుందో వారికే తాము ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన భూ బాధితులు

Satyam NEWS

చైనా లోన్ అప్లికేషన్ బాధిత కుటుంబానికి అండగా కల్వకుంట్ల కవిత

Satyam NEWS

ఇది రక్షకభుటుల కార్యాలయమా? బిఆర్ఎస్ కార్యాలయమా?

Satyam NEWS

Leave a Comment