మాజీ మంత్రి జగన్ నాయక్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
మాజీ మంత్రి, బిజెపి నాయకులు పోరిక జగన్ నాయక్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ లతోపాటు మరో 30 మంది టిఆర్ఎస్ బిజెపి నుండి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని, ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి ములుగు నియోజకవర్గంలో సీతక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరినవారిలో జగన్ నాయక్ తనయుడు వేణుగోపాల్ నాయక్, అబ్బాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది ఓరుగంటి రాజేందర్, తోట రాజేందర్, కంచం రాజయ్య, తోట మధుకర్, ఇండ్ల శంకర్, మల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి లతోపాటు 30 మంది చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, నియోజకవర్గ ఇన్చార్జి రవళి రెడ్డి, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.