ములుగు జిల్లా మేడారం ఆలయం నేటి నుంచి పున:ప్రారంభం కానున్నది.
చిన్న జాతర తర్వాత కోవిడ్ వల్ల మేడారం ఆలయం మూతపడిన విషయం తెలిసిందే.
కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నేటి నుంచి భక్తులకు మళ్లీ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలు సడలించడంతో మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనం ఆరంభం కానున్నది.