విశాఖపట్నంలో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న సైకో కనిపించాడు. విశాఖపట్నంలోని రెల్లి వీధిలోని ఒక పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న వ్యక్తి కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది.
రావేలపూడి రాజు(20) అనే వ్యక్తి పుర్రెను కాల్చుకుని తింటుండగా పట్టుబడ్డాడు. ఇది స్థానికులు చూశారని తెలుసుకుని రాజు పరారయ్యాడు.
ఒంటరిగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసైన రాజు సైకోగా మారాడని అంటున్నారు. నిందితుడు రాజు ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.