కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి స్థాయి లాక్ డౌన్ తో కుటుంబాలు పూట గడవక ఇబ్బందులకు గురవుతున్న 5 నిరుపేద కుటుంబాలకు 6 వ వార్డు కౌన్సిలర్ రమ్య నాగరాజు ఆపన్న హస్తం అందించారు. వారి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
వార్డులో ప్రతిరోజు కరోనా వైరస్ పై ఇల్లు ఇల్లు తిరుగుతూ అవగాహన పెంచుతున్నారు. అందులో భాగంగానే నిరుపేద కుటుంబాలను గుర్తించి 5 కిలోల బియ్యం, పప్పు, నూనె కూరగాయలు ప్రతి కుటుంబానికి 500 రూపాయలతో పాటు మరో కుటుంబానికి 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన నాయకులు మాజీ వార్డ్ సభ్యులు దూరయ్య, మెహదీనవాజ్, వనజ పాల్గొన్నారు.