26.7 C
Hyderabad
May 3, 2024 10: 06 AM
Slider మహబూబ్ నగర్

కరోనా హెల్ప్:నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం

corona help 111

కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి స్థాయి లాక్ డౌన్ తో కుటుంబాలు పూట గడవక ఇబ్బందులకు గురవుతున్న 5 నిరుపేద కుటుంబాలకు 6 వ వార్డు కౌన్సిలర్ రమ్య నాగరాజు ఆపన్న హస్తం అందించారు. వారి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

వార్డులో ప్రతిరోజు కరోనా వైరస్   పై ఇల్లు ఇల్లు తిరుగుతూ అవగాహన  పెంచుతున్నారు. అందులో భాగంగానే నిరుపేద కుటుంబాలను గుర్తించి 5 కిలోల బియ్యం, పప్పు, నూనె కూరగాయలు  ప్రతి కుటుంబానికి 500 రూపాయలతో పాటు మరో కుటుంబానికి 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన నాయకులు మాజీ వార్డ్ సభ్యులు దూరయ్య, మెహదీనవాజ్, వనజ పాల్గొన్నారు.

Related posts

వసంతం అంటే

Satyam NEWS

వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు

Satyam NEWS

వ‌చ్చే నెల 15 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్ ప్రొగ్రామ్

Satyam NEWS

Leave a Comment