మేడ్చల్ జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేడ్చల్ జిల్లా మేరుసంఘం అధ్యక్షునిగా రామగిరి యాదగిరిమేరు (గిరి), ధ్రానకార్యదర్శిగా రాపర్తి శ్రీనివాస్మేరు, కోశాధికారిగా రామగిరి పద్మావతిమేరు ఎన్నికయ్యారు.
ఈ మేరకు తెలంగాణ మేరు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి , ఎన్నికల అధికారి బత్తుల కరణ్మేరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మాజీ రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా పనిచేసిన వెన్ను నరసింగరావుమేరు పర్యవేక్షకులుగా వ్యవహరించగా , జిల్లా అన్ని మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శిలు చర్చించి వారి తీర్మానంతో జిల్లా కార్యవర్గం ఎన్నికైనట్లు ప్రకటించారు.