సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్(19), కూన ప్రశాంత్(20), పి.వరప్రసాద్(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి దిగారు. ఈతకొట్టేందుకు ప్రయత్నించి వాగులోని ఓ గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. దీనిని గుర్తించిన అక్కడివారు.. గాలించి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
previous post