38.2 C
Hyderabad
April 28, 2024 19: 53 PM
Slider తెలంగాణ

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

youth died

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్‌(19), కూన ప్రశాంత్‌(20), పి.వరప్రసాద్‌(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి దిగారు. ఈతకొట్టేందుకు ప్రయత్నించి వాగులోని ఓ గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. దీనిని గుర్తించిన  అక్కడివారు.. గాలించి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

Related posts

చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలి

Bhavani

రామప్ప లో ఘనంగా వారసత్వ ఉత్సవాలు

Satyam NEWS

పేదరికంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment