త్వరలో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న దయా వెబ్ సీరీస్ లో నటించిన ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి తో విజయవాడలో “మీట్ & గ్రీట్” కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని PVP మాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను ఆయనతో సంభాషించే అవకాశం కల్పించింది. దయా కథ, టైటిల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ తన వ్యాన్ లోపల నిర్జీవమైన శరీరాన్ని కనుగొన్నప్పుడు అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. వెబ్ సిరీస్ లో వైవిధ్యమైన నటుడు జెడి చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబేసన్, విష్ణుప్రియ, కమల్ కామరాజ్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు నటించారు.
ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. నటుడు జెడి చక్రవర్తి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ “డిస్నీ+ హాట్స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా వున్నాను. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం మరియు తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్ నాకు దానిని అందించింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జెడి చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా మాట్లాడారు, ఈ క్రైమ్ థ్రిల్లర్లో తన పాత్రపై వారి సందేహాలను ఓపికగా నివృత్తి చేశారు. కొంతమంది అతని వయస్సు గురించి అడిగారు. అలాగే, అతను తన అభిమానులతో వ్యక్తిగత విశేషాలు మరియు సెల్ఫీలను క్లిక్ చేస్తూ ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకున్నారు.