తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నేడు పుంగనూరు లో సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ శనివారంనాడు చిత్తూరు జిల్లా బంద్ కు అధికార వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసిపి జిల్లా అధ్యక్షులు కె.అర్.జే భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా ఖండిస్తూ రేపు (05.08.2023) జిల్లా బందు కు పిలుపునిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని కోరుతున్నామని కూడా ఆయన తెలిపారు.
next post