34.2 C
Hyderabad
May 19, 2025 17: 28 PM
Slider రంగారెడ్డి

కీసర ఎమ్మార్వో: వామ్మో ఇది అవినీతి అనకొండ

#KeesaraMRO

హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఓ భూమికి సంబంధించి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా, కీసర ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏఎస్ రావు నగర్‌లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీంతో వెంటనే నాగరాజు ఇల్లు, ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది.

కీసర ఎమ్మార్వో పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్టు తెలిసింది. ఆ భూ వివాదాలకు క్లియర్ చేసేందుకు నాగరాజు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేసినట్టు భావిస్తున్నారు.

ఈ రోజు రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా ఏఎస్ రావు నగర్‌లోని ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Related posts

అంబేద్కర్ ఓపెన్ డిగ్రి నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ గా షేక్ ఖాజబి

Satyam NEWS

One Side Love: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

Satyam NEWS

ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!