38.2 C
Hyderabad
May 3, 2024 21: 43 PM
Slider ముఖ్యంశాలు

అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం

#assembly elections

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మరియు జిల్లా సరిహద్దు పోలీసు అధికారులతో సత్తుపల్లి మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో విజయవాడ రూరల్ డీసీపీ అజీతా, ఏలూరు ఆడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒయస్డీ సాయి మనోహర్ , అడిషనల్ డీసీపీ కెఆర్కే ప్రసాద్ రావు, ఏసీపీలు రామనుజం, గణేష్, ప్రసన్న కుమార్, రహేమాన్, ఇంటిలిజెన్స్ అధికారులు, జిల్లా సరిహద్దు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సరిహద్దులో పటిష్ట నిఘా పెట్టడంతో పాటు మద్యం, బోగస్ ఓటర్లు, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు.

ఎన్నికల నియమావళి పరిరక్షణే ధ్యేయంగా సరిహద్దు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వారిని నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, పోలీస్‌ అధికారులు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు.

సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చెక్‌ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Related posts

పనిష్మెంట్: కన్నం వేసిన దొంగకు ఆరు నెలల జైలు

Satyam NEWS

జోషిమఠ్ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

Bhavani

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment