26.7 C
Hyderabad
May 15, 2024 08: 20 AM
Slider ప్రత్యేకం

దావోస్ లో ఇద్దరు మిత్రుల కథ…

#raghurama

దావోస్ పెళ్లి న బృందంలో సభ్యుడైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తో, పశు వైద్యుడు… వివిధ కేసుల్లో సీబీఐ గాలిస్తున్న పంచ్ ప్రభాకర్ భేటీ కావడం ఆశ్చర్యంగా ఉందని నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కూడా ఆయన భేటీ అయినట్లు మాటల ద్వారా తెలుస్తోందన్నారు.

సీబీఐ కేసులలో ఏ వన్ నిందితుడిగా ఉండి, కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళిన వ్యక్తి, సిబిఐ గాలిస్తున్న మరొక వ్యక్తి తో భేటీ కావడాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయని భావిస్తున్నానన్నారు.  దావోస్ వెళ్లిన ఆయన వస్తాయో… రావో తెలియని ప్రాజెక్టులపై సంతకాలు చేసుకున్నారని, అలాగే  ఎవరిని నిందించాలని… బూతులు మాట్లాడే ఆ వ్యక్తితో అనధికారికంగా  ఎం వో యు కుదుర్చుకున్నారో చెప్పాలన్నారు.  ఒకవైపు రాష్ట్రంలో జరిగిన సంఘటన కు నష్ట  నివారణ చర్యలు చేపడుతున్న తరుణంలో, అదే సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బూతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Related posts

కష్టపడి పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా?

Satyam NEWS

తమ కాళ్లను తామే నరుక్కుంటున్న కమలనాథులు

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Bhavani

Leave a Comment