38.2 C
Hyderabad
May 2, 2024 19: 12 PM
Slider నల్గొండ

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

#Congress party

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138వ, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేకును కట్ చేశారు.

ఈ సందర్భంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎ.ఓ.హుమే నాయకత్వంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ,సర్ధార్ వల్లభాయ్ పటేల్,లాల్ బహుదూర్ శాస్త్రి,సరోజినీ నాయుడు,నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్,మౌలానా అబుల్ కలాం ఆజాద్,ఇందిరా గాంధీ లాంటి ఎందరో గొప్ప నాయకులు పార్టీ నిర్మాణంలో వారి యొక్క జీవితాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చే విషయంలో ఎన్నో పోరాటాలు కనపర్చారని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని, అటువంటి ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మనమందరం సభ్యులుగా ఉండటం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో మొట్టమొదటి స్టార్టరప్ కు ప్రోత్సాహం

Satyam NEWS

ఆర్‌ఆర్‌ఆర్ పై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

Sub Editor 2

Leave a Comment