రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మడం వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుందని సామాజిక దూరం పాటించకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన అన్నారు.
విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ తీరు పై విరుచుకు పడ్డారు. ఒక్క విశాఖ లోనే మొన్న 1049 నిన్న 646 కేసులు వచ్చాయని కరోనా కంట్రోల్ చేయటం లో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.