కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ .2 లోని శ్రీ షిర్డిసాయినాథుని ఆలయ నిర్వాహకులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో ఆలయ నిర్వాహకులు ఎల్. రాజా ఆయనను కలిసారు. ఈ సందర్భంగా శ్రీసాయి బాబా దేవాలయం లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమలు, ఇటీవల నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, ధ్యాన మందిరం, దేవతామూర్తుల ఉత్సాహ విగ్రహాల ఆలయ నిర్మాణం గురించి చిరంజీవికి రాజా వివరించారు.
అయ్యప్ప దీక్ష తీసుకొనే భక్తుల కోసం చేస్తున్న అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగామని రాజా ఆయనకు వివరించారు. మరింత శ్రద్దగా శ్రీ సాయి మందిరాన్ని నిర్వహించి మెరుగైన సేవలను అందించాలను చిరంజీవి సూచించారు.