42.2 C
Hyderabad
April 26, 2024 18: 28 PM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

#RoadAccident

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఈ ఘటన జరిగింది.

రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఎక్కడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులు శారమ్మ, మార్తమ్మ, లింగమ్మ, వెంకటేశ్‌రెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Related posts

ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Satyam NEWS

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

రాగోలు ఎంపిటిసి బిజెపి అభ్యర్థిగా చల్లా రాజా

Satyam NEWS

Leave a Comment