కడప జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో హోమ్ నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా ఆర్ అండ్ బి బంగాళా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందించారు ఉద్యోగులు. కొ త్త జీతాలు వద్దు పాత జీతాలు ముద్దు,ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక వినాదాలు చేశారు. ఉదృతం చేస్తామని,పీఆర్సీ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేదిలేదని ప్రభుత్వంను హెచ్చరించారు.
previous post