తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఖతార్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు టెలిఫోన్ లో మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ థానీ ట్వీట్ చేశారు. దానికి బదులుగా శనివారం నాడు ఆయన ఫోన్లో మాట్లాడారు.
నవంబర్లో ఖతార్లో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచ కప్కు సంబంధించి థానీకి ప్రధాని ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. 2023లో దౌత్య సంబంధాల 50 ఏళ్ల వేడుకల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు.