కృష్ణాజిల్లా మచిలీపట్నం లో దారుణం జరిగింది. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్ వెనుక, ఆర్.సి.ఎం చర్చి ప్రాంగణంలో మేరీ మాత విగ్రహం ఎవరో దుండగులు ధ్వసం చేశారు. ఇదే రహదారిలో చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్ మరియు డి.యస్.పి కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం పోలీసులు గస్తీ తిరిగే ఈ ప్రాంతంలో ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా పూజించే తల్లి మరియ మాత స్వరూపాన్ని ధ్వసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
previous post