ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. వివేకా కుమార్తె సునీతరెడ్డి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. ‘‘సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదు. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారు’’ అని పిటిషన్లో సునీతరెడ్డి పేర్కొన్నారు. సీబీఐ అధికారులనే బెదిరించడం, వారిపైనే తిరిగి కేసులు పెట్టడం జరుగుతున్నది.
previous post
next post