సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సమ్మిడి వీరారెడ్డి జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్ స్కాలర్షిప్ బహుమతి ప్రధానోత్సవ వేడుకను 2021-2022 విద్యా సంవత్సరముకు గాను శుక్రవారం మఠంపల్లి లోని సాగర్ సిమెంట్స్ ప్లాంట్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమములో భాగంగా మునుపటి మాదిరిగానే మఠంపల్లి మండలము గల అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను,జ్ఞాపికలను,మెరిట్ సర్టిఫికేట్ లను అందచేశారు. ఈ నగదు బహుమతి ప్రధమ స్థానమునకు 20,000 వేల రూపాయలు,ద్వితీయ స్థానమునకు 15,000,తృతీయ స్థానమునకు 10,000 రూపాయలు చొప్పున ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి చత్రు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమములో సాగర్ సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యం.వి.రమణ మూర్తి,డిజిఎం-హెచ్.ఆర్ హరిదాస్,వివిధ విభాగముల ఉన్నత అధికారులు,ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు,తల్లితండ్రులు పాల్గొని కీ.శే. సమ్మిడి వీరారెడ్డి ని,సాగర్ సిమెంట్స్ యొక్క విశిష్ట సేవలను మరువలేనివని కొనియాడారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్