33.2 C
Hyderabad
May 14, 2024 12: 00 PM
Slider నల్గొండ

సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్ స్కాలర్షిప్ ప్రదానోత్సవం

#sammidiveerareddy

సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సమ్మిడి వీరారెడ్డి  జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్ స్కాలర్షిప్ బహుమతి ప్రధానోత్సవ వేడుకను 2021-2022 విద్యా సంవత్సరముకు గాను శుక్రవారం మఠంపల్లి లోని సాగర్ సిమెంట్స్ ప్లాంట్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమములో భాగంగా మునుపటి మాదిరిగానే మఠంపల్లి  మండలము గల అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను,జ్ఞాపికలను,మెరిట్ సర్టిఫికేట్ లను అందచేశారు. ఈ నగదు బహుమతి ప్రధమ స్థానమునకు 20,000 వేల రూపాయలు,ద్వితీయ స్థానమునకు  15,000,తృతీయ స్థానమునకు  10,000 రూపాయలు చొప్పున ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి చత్రు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమములో సాగర్ సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యం.వి.రమణ మూర్తి,డి‌జి‌ఎం-హెచ్‌.ఆర్ హరిదాస్,వివిధ విభాగముల ఉన్నత అధికారులు,ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు,తల్లితండ్రులు పాల్గొని కీ.శే. సమ్మిడి వీరారెడ్డి ని,సాగర్ సిమెంట్స్ యొక్క విశిష్ట సేవలను మరువలేనివని కొనియాడారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

భార్య ఆత్మహత్య కేసులో అత్తకు, భర్తకు జైలు శిక్ష

Murali Krishna

కూకట్ పల్లి అసెంబ్లీ లో బీఆర్ఎస్ కు భారీ షాక్

Satyam NEWS

స్ట్రాటజీ: ప్లాన్ మూడో దశలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు

Satyam NEWS

Leave a Comment