విజయనగరం జిల్లాకు మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారు. ఆయన ఒకే రోజు మూడు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 24 వ తేదీ న ఉదయం 10-30 గంటలకు నగరంలోని ఘోష ఆసుపత్రిలో డి.ఐ.ఇ.సి.లో బధిరుల కోసం నిర్వహిస్తున్న ఇ.ఎన్.టి. శస్త్ర చికిత్సా శిబిరాన్ని సందర్శించి, మైక్రో వాటర్ సప్లై స్కీమ్ కింద మెషీన్ లు పంపిణీ చేస్తారు. మధ్యహ్నం 3-00 గంటలకు రేగిడి ఆమదాలవలస మండలంలో వై.ఎస్.ఆర్. చేయూత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు. సాయంత్రం 5-00 గంటలకు చీపురుపల్లి మండలం ఇటకర్ల పల్లి లో గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తారు.
previous post