టీడీపీ మినీ మహానాడులో ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు…
జరిగిన తప్పులను మరల జరగకుండా చూడటం అది చాలా అవసరమని..ఏ కొబ్బరి చెట్టో నాటి మామిడికాయలు రమ్మంటే…ఏం జగన్ వచ్చిన జరగని పని అని కేంద్ర మాజీ మంత్రి…టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యడు..ఆ పార్టీ సీనియర్ నేత పీ.అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా కేంద్రం.. అశోక్ బంగ్లాలో టీడీపీ మినీ మహానాడు.. జరిగింది.ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ…ఓ వైపు పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూనే…మరో వైపు జగన్ ప్రభత్వంపై సెటైర్లు వేసారు.మనం ఆలోచితంగా ఉన్నా…వ్యవహరించినా..జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన వ్యక్తే..మన జేబుల్లో చేయిపెట్టి…లాగుతుంటే…మనం చేతలు ముడుచుకుని కూర్చుంటే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయని అశోక్ ఆవేదన వ్యక్తం చేసారు.
మనం ఎంత బాద్యతగా నలిబడితే అంత గా మనకు మన పార్టీకి మేలు జరుగుతుందని భవిష్యత్ లో రాష్ట్రంలో టీడీపీ ఒక్కటే ఉంచేందుకు ఈ మహానాడు సాక్షిగా మనందరమూ గట్టికా కృషి చేద్దామని అశోక్ గజపతి రాజు అన్నారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ఎందుకు మనం భయపడాలని…40 ఏళ్లు టీడీపీ చర్చోపచర్చలు గా కార్యకర్తలే బలంగా వెళుతోందని..విధానపరమైన నిర్ణయాలతో టీడీపీ ముందుకు వెళుతోందని అశోక్ స్పష్టం చేసారు.
చేసిన పనులలో పెద్దరిక ఉంటుందని…సీఎం జగన్ నుద్దేశించి పరోక్షంగా అశోక్ ..మినీ మహానాడులో ఉద్షాటించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కనకలమురళీ మోహన్, విజ్జపు వెంకట ప్రసాద్, లక్ష్మీ వర ప్రసాద్, కిమిడి నాగార్జున బొద్దుల నరసింగహరావు,,కర్రోతు నర్సింగరావు,కందిమురళీ నాయుడులతో పాటు నియోజవక వర్గ నేతలు పాల్గొన్నారు.